Monday, May 6, 2024

నిజామాబాద్ జిల్లాలో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం..

నిజామాబాద్ జిల్లా డిచ్ ప‌ల్లిలో దారుణం చోటుచేసుకుంది. అభం,శుభం తెలియ‌ని ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెంద‌డం విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఇది సాధార‌ణ మృతిగా న‌మ్మించేందుకు య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. బంధువులు ప‌ట్టుబ‌ట్టి మ‌రీ పోస్ట్ మార్టం నిర్వ‌హించాల‌ని కోర‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. చిన్నారి అత్యాచారానికి గురైట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో వెల్ల‌డైంది. బాలిక త‌ల్లితో స‌హ‌జీవ‌నం చేస్తున్న నిందితుడు చిన్నారిపై క‌న్నేసి అత్యాచారానికి ఒడిగ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement