Sunday, May 5, 2024

Asian Games – భారత్, అప్ఘ‌నిస్తాన్ మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం – టాప్ సీడ్, అత్య‌ధిక ర‌న్ రేట్ తో టీమ్ ఇండియాకు గోల్డ్..

ఆసియా గేమ్స్ క్రికెట్ విభాగంలో టీమ్ ఇండియా గోల్డ్ మెడ‌ల్ ను సాధించింది.. ఫైన‌ల్స్ నేడు భారత్, అప్ఘ‌నిస్తాన్ ను త‌ల‌ప‌డ్డాయి.. గోల్డ్ మెడ‌ల్ కోసం జ‌రుగుతున్న ఈ పోరులో ముందుగా భారత్ టాస్ గెలిచి అప్ఘ‌న్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. 18.2 ఓవ‌ర్ల‌లో అప్ఘ‌న్ అయిదు వికెట్లు కోల్పొయి 112 ప‌రుగులు చేసింది.. ఈ స‌మ‌యంలో వ‌ర్షం దంచి కొట్ట‌డంతో మ్యాచ్ ను నిలిపివేశారు.. వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో మ్యాచ్ ను ర‌ద్దు చేశారు.. టాప్ సీడ్ తో బ‌రిలోకి భార‌త్ ఈ పోటీలో దిగ‌డం, ఈ టోర్నిలో అత్య‌ధిక ప‌రుగులు భార‌త్ ఖాతాలో ఉడటంతో గోల్డ్ మెడ‌ల్ ప్ర‌క‌టించారు.. అప్ఘ‌న్ కు వెండి ప‌త‌కం ల‌భించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement