Monday, May 6, 2024

కార్తీ చిదంబరం అనుచరుడి అరెస్ట్

వీసాల కోసం లంచం తీసుకున్నారనే అభియోగాలతో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంపై కొత్త కేసు నమోదు చేసిన సీబీఐ.. ఆయన సహచరుడైన ఎస్.భాస్కర్ రామన్‌ను అరెస్ట్ చేసింది. పంజాబ్‌లోని తాల్వండి సాబూ ప‌వ‌ర్ ప్లాంట్‌లో ప‌నిచేస్తున్న 263 మంది చైనీయుల‌కు వీసాలు ఇప్పించేందుకు రూ.50 ల‌క్ష‌ల లంచం తీసుకున్న‌ట్లు అత‌నిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మంగళవారం రాత్రి ప్రశ్నించిన అనంతరం ఆయనను సీబీఐ అదుపులోకి తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement