Saturday, May 4, 2024

ఆదిభట్ల యువతీ కిడ్నాప్ ఘటనతో మాకు సంబంధం లేదు.. టీ టైం మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ గణేష్

బంజారా హిల్స్, (ప్రభన్యూస్): రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ యువతి కిడ్నాప్​ కేసుతో తమకు సంబంధం లేదంటున్నారు టీ టైం మేనేజింగ్​ డైరెక్టర్​ అర్జున్​ గణేశ్​. మన్నేగూడలోని సిరి టౌన్ షిప్ లో నిన్న జరిగిన యువతి కిడ్నాప్ ఘటనలో ట్విస్ట్లుల మీదల ట్విస్టులు చోటుచేసకుంటున్నాయి. అయితే.. ఈ కిడ్నాప్​ ఘటనతో తమకు కానీ, తమ వ్యాపార కలాపాలకు కానీ సంబంధం లేదని బంజారాహిల్స్ లోని టీ టైం ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ గణేష్ అన్నారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. అమ్మాయి కిడ్నాప్ కు ఘటనకు సంబంధించి వివిధ మీడియా సంస్థలలో తమ వ్యాపారమైన “టీ టైమ్ ” పేరున వార్తలు వస్తున్నాయన్నారు. వాటన్నిటిని కూడా టీ టైం మేనేజింగ్ డైరెక్టర్ గా తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement