Friday, May 3, 2024

ఢిల్లీలో అభినందిస్తూ.. గల్లీలో విమ‌ర్శ‌లు… కేంద్రం అవార్డులే మా పని తనానికి నిదర్శనం : మంత్రి ఎర్రబెల్లి

మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్‌శాఖకు వచ్చిన కేంద్ర అవార్డులే తమ పని తనానికి నిదర్శనమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఖైతరాబాద్‌లోని రంగారెడ్డి జడ్పీ కాన్ఫరెన్స్‌లో హాలులో జరిగిన కార్యక్రమం అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తాగునీటికి ఎంతో కష్టాలు పడ్డారని, మహిళల బిందెలు పట్టుకొని ఎంతోదూరం నడుచుకుంటూ వెళ్లేవారని గుర్తు చేశారు. అసెంబ్లీలోనూ విషయంపై చర్చలు జరుగుతుండేవన్నారు. కేంద్రం ఎన్నోసార్లు రాష్ట్రాన్ని అభినందించి.. పార్లమెంట్‌లో సైతం రాష్ట్ర అభివృద్ధిని కొనియాడారని, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. కేంద్రం ఢిల్లీలో అభినందిస్తూ గల్లీలో విమర్శిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కేంద్రం అవార్డులు ఇస్తే రాష్ట్ర నాయకులు ఫేక్‌ లెటర్లు క్రియేట్‌ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గాంధీ జయంతి రోజున తెలంగాణకు అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. మిషన్ భగీరథకు కేంద్ర పురస్కారం రావడంపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, డైరెక్టర్‌ హనుమంతరావు, మిషన్‌ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డితో పాటు పలువురు అధికారులను మంత్రి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement