Thursday, May 2, 2024

ఇంజనీరింగ్‌ కాలేజీల గుర్తింపునకు దరఖాస్తులు

హైదరాబాద్‌ ఆంధ్రప్రభ : 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్‌, వృత్తి విద్యా కాలేజీల గుర్తింపునకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రకటన విడుదల చేసింది. కొత్త, పాత కళాశాలలు అనుబంధ గుర్తింపును తీసుకోవాలని ఈమేరకు సూచించింది. మంగళవారం నుంచి ఏప్రిల్‌ 22 అర్థరాత్రి వరకు దరఖాస్తు స్వీకరణకు అవకాశం కల్పించారు. అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 29 వరకు గడువిచ్చారు. సంబందిత ధ్రువపత్రాలు, నిర్ధేశిత రుసుమును సమర్పించి అనుంబంధ గుర్తింపును పొందాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement