Friday, May 3, 2024

అమ్మబాబోయ్…. చంద్రబాబు భాష బాలేదు – కొడాలి

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కోడలి నాని సంచలన వ్యాక్యలు చేశారు. ప్రజలను గౌరవించలేని ఒక సన్నాసి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. ప్రజలే దేవుళ్ళు గా భావించి ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. అలాంటి వ్యక్తిని దుర్మార్గ గా వెన్నుపోటు పొడిచి సిగ్గు శరం లేకుండా పార్టీ ఆవిర్భావ వేడుకలు చేస్తారా అంటూ మండిపడ్డారు. మున్సి పల్ ఎన్నికల ప్రచారం లో చంద్రబాబు వాడిన భాష ప్రజలపై చంద్రబాబు కు ఉన్న మనస్తత్వం ఏంటో అర్ధం అవుతుంది. అధికారం లేక పోతే చంద్రబాబు ప్రజలను అమ్మనా బూతులు మాట్లాడుతున్నారు.కొంతమంది పంది కొక్కులు చంద్రబాబు అధికారం లో కి రావాలని కొరుకోవచ్చు….కానీ ప్రజలు మాత్రం జగన్ వెంటే ఉంటారని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. వైసీపీ ప్రభుత్వం కరోనా కష్ట కాలం లో ప్రజలు పడుతున్న అవస్తులు చూసి ప్రజలను కాపాడటానికి వాళ్ళ కడుపు నింపడానికి అప్పు తెచ్చిన మాట వాస్తవం.అందుకే ప్రజలు స్థానిక ఎన్నికల్లో వైసీపీ కి పట్టం కట్టారు.

జగన్ ..వైఎస్ ఆశయాలకు ఎన్టీఆర్ సిద్ధాంతాలకు వారసుడన్నారు కొడాలి. వెన్ను పోటు పొడిచి ఒక సారి బీజేపీ తో పొత్తు పెట్టుకుని రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. మీడియా లో డబ్బా కొట్టుకుంటే చంద్రబాబు గొప్ప అవుతాడాన అంటూ ప్రశ్నించారు కొడాలి.
కొంతమంది వేదవలను నమ్మి ఎన్టీఆర్ అన్యాయం గా ప్రాణాలు కోల్పోయారు.తిరుపతి ఎన్నికల ప్రచారం లో చివరకు వేంకటేశ్వర స్వామిని కూడా తీసుకొచ్చారు. తిరుమల లో తలనీలాల స్కాం అంటూ ప్రచారం చేస్తున్నారు… రాబోయే ఎన్నికల ఫలితాల లో ఆ ప్రచారం చేసే వాళ్ళ తుప్పు ప్రజలు వదిలిస్తారన్నారు. వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తో తిరుపతి లో వైసీపీ అభ్యర్థి ఐదు లక్షల మెజార్టీ తో గెలుస్తాం అని నమ్మకం ఉందన్నారు. ఇక నుంచి చంద్రబాబు లోకేష్ సెప్టెంబర్ 1 న టీడీపీ వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement