Tuesday, April 30, 2024

సంగం డైరీ యాజమాన్య హక్కులు మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం

సంగం డైరీ అంశంలో ఏపీ ప్రభుత్వం కీలక జీవో విడుదల చేసింది. సంగం డైరీ యాజమాన్య హక్కులు మారుస్తూ జీవోను జారీ చేసింది ప్రభుత్వం. డెయిరీ బాధ్యతను గుంటూరు జిల్లా పాలఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డెయిరీ రోజువారీ కార్యకలాపాలు నిర్వగహించే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు అప్పగించింది. దీంతో సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ డెయిరీకి చేరుకున్నారు. రోజువారీ కార్యకలాపాలు ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతోనే జీవో విడుదల చేసినట్లు చెబుతోంది ప్రభుత్వం. మరోవైపు డెయరీ వ్యవహారంలో ప్రభుత్వం తీరును సవాల్ చేస్తూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో పిటిషన్ వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement