ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్కు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ను హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏపీ సీఎం జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని పిటిషనర్ కోర్టును కోరారు. పిటిషన్పై ఈ నెల 7న సైతం విచారణ జరగ్గా కౌంటర్ దాఖలుకు కోర్టును, సీబీఐ అధికారులను జగన్ సమయం కోరారు. దీంతో కోర్టు విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది. ఈలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement