Tuesday, May 7, 2024

జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నేడు విచారణ

ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది. వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను హైద‌రాబాద్‌ నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఏపీ సీఎం జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని పిటిష‌నర్‌ కోర్టును కోరారు. పిటిషన్‌పై ఈ నెల 7న సైతం విచారణ జరగ్గా కౌంట‌ర్ దాఖ‌లుకు కోర్టును, సీబీఐ అధికారులను జ‌గ‌న్ స‌మ‌యం కోరారు. దీంతో కోర్టు విచార‌ణ‌ను ఈనెల 17కి వాయిదా వేసింది. ఈలోపు కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement