Saturday, May 11, 2024

టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్‌.. త్వరలో 149 ఏఎంవీఐ పోస్టులకు ఉద్యోగ ప్రకటన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిరుద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌ తెెలపనుంది. త్వరలోనే టీఎస్‌పీఎస్సీ నుంచి నోటిఫికేషన్‌ వెలువడనున్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను జారీ చేసి దరఖాస్తు ప్రక్రియను చేపడుతున్న విషయం తెలిసిందే. రవాణా శాఖలో ఉన్న దాదాపు 149 అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ త్వరలో వెలువడనున్నట్లు సమాచారం.

ఇప్పటికే వీటికి సంబంధించిన ఇండెంట్లు టీఎస్‌పీఎస్సీకి చేరాయి. అయితే వీటిని అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు వైద్యారోగ్య శాఖలోని పోస్టుల భర్తీకి ఆ శాఖ పంపిన ప్రతిపాదనలు సక్రమంగా లేకపోవడంతో కమిషన్‌ వాటిని తిప్పి పంపినట్లు తెలిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement