ఐపీఎల్ 2023 లో ఇవ్వాల మొహాలీ వేదికగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డ్ని క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్కి ఆర్సీబీ కెప్టెన్గా కూడా వ్యవహరిస్తున్న కోహ్లీ, టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేయగా.. 47 బంతులాడిన కోహ్లీ 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 59 పరుగులు చేసి ఔటయ్యాడు.
మ్యాచ్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ.. ఐపీఎల్లో 100 సార్లు 30+ స్కోరు చేసిన తొలి ప్లేయర్గా నిలిచాడు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఈ 16 ఏళ్లలో ఏ ప్లేయర్కీ కూడా ఈ రికార్డ్ సాధ్యం కాలేదు. సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్లో 229 మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ 129.63 స్ట్రైక్రేట్తో 6903 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా కోహ్లీనే కావడం విశేషం.