Friday, April 26, 2024

ఈనెల 20 నుంచి తిరుచానూరులో వార్షిక తెప్పోత్సవాలు

తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలను ఈ నెల 20 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా జరుగనున్నాయి. కరోనా నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో ఉత్సవమూర్తుల‌ను పుష్కరిణి వరకు ఊరేగింపుగా తీసుకొచ్చే అవకాశం లేనందున ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు. ఐదు రోజుల‌ పాటు ఆల‌యంలోని శ్రీ‌కృష్ణ ముఖ మండ‌పంలో మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల‌ వరకు ఉత్సవమూర్తులకు తిరుమజనం (అభిషేకం) చేస్తారు. 20న శ్రీకృష్ణస్వామివారికి, జూన్ 21న శ్రీ సుందరరాజస్వామివారికి, 22 నుంచి 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తికి అభిషేకం నిర్వహిస్తారు. తెప్సోత్సవాల కారణంగా ఐదు రోజుల పాటు కల్యాణోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement