Thursday, May 2, 2024

Latest | ఆదిపురుష్​కి ఏపీ, తెలంగాణ స్వాగతం.. టిక్కెట్​ రేట్లు పెంచుతూ జీవో జారీ

ఓం రౌత్ డైరక్ష‌న్ లో ప్ర‌భాస్ లేటెస్ట్ పాన్ ఇండియ‌న్ మూవీ ఆదిపురుష్ మూవీకి నిన్న తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్టు రేట్ రూ.50 పెంచుతూ కొత్త జి.ఓ జారీ చేసింది. కాగా, ఇప్పుడు ఆంధ్రప్ర‌దేశ్ ప్రభుత్వం కూడా ప్రభాస్ నటించిన ఈ సినిమాకి రూ.50 టిక్కెట్ పెంపును అనుమతించింది. దీనికి సంబంధించి కొత్త జీఓని నెం 13 పేరుతో విడుదల చేశారు.

జి.ఓ ప్రకారం జూన్ 16 నుండి ప్రారంభమయ్యే పది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లకు టిక్కెట్ పెంపుదల వర్తిస్తుంది. దీని ప్రకారం, ఆదిపురుష టిక్కెట్టు ఛార్జీలు ఉంటాయి మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లలో రూ. 236, రూ 210 ఉండ‌నున్నాయి. ఇక ఇప్ప‌టికే హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. దీంతో ఆదిపురుష్​ మూవీ టిక్కెట్లు హాట్‌కేక్‌లుగా అమ్ముడవుతున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement