Thursday, May 16, 2024

Blood Donation Day | గ‌ద్వాల జిల్లా ర‌క్త‌దాత‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌శంస‌లు

జోగులాంబ గద్వాల, (ప్రభ న్యూస్) : ప్ర‌పంచ ర‌క్త‌దాన దినోత్స‌వం సంద‌ర్భంగా ఇవ్వాల (బుధ‌వారం) గ‌ద్వాల జిల్లాలో ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికంగా 680 యూనిట్ల రక్తాన్ని సేక‌రించినందుకు గాను అయిజ మండ‌ల సింగిల్ విండో మాజీ అధ్య‌క్షుడు సంకాపురం రాముడు, రెడ్‌క్రాస్ చైర్మ‌న్ న‌ట‌రాజ‌న్‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప్ర‌శంసించారు.

వీరు ఇద్ద‌రు గ‌వ‌ర్న‌ర్ నుంచి ప్ర‌శంసా ప‌త్రం కూడా అందుకున్నారు. కొన్ని విప‌త్క‌ర ప‌రిస్థితులు, యాక్సిడెంట్లు, ఆప‌రేష‌న్ల స‌మ‌యంలో ఎంతోమంది ర‌క్తం అంద‌క చ‌నిపోయే ప‌రిస్థితులుంటాయ‌ని, అట్లాంటి వారికి స‌రైన స‌మ‌యంలో ర‌క్తం అంద‌డం వ‌ల్ల ప్రాణాల‌తో బ‌తికే చాన్స్ ఉంటుంద‌ని గ‌వ‌ర్న‌ర్ అన్నారు. ర‌క్త దాత‌లు ముందుకు వ‌చ్చి ర‌క్తం దానం చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement