Friday, May 3, 2024

చేస్ ఛాంపియన్ ప్రజ్ఞానందకి ఆనంద్ మహీంద్రా ప్రత్యేక బహుమతి..

దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తరచుగా తన ట్వీట్లతో, సామాజిక సమస్యలపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించే ఆనంద్‌ మహీంద్రా వార్తల్లో నిలుస్తారు. దేశంలో ఏదైనా రంగంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వారికి తనదైన శైలిలో బహుమతులు ఇస్తుంటారు. ఇప్పటికే చాలా మందికి బహుమతులు ఇచ్చి సత్కరించారు.

అయితే, రీసెంట్ గా ప్ర‌పంచ చెస్ ఛాంపియ‌న్ షిప్ లో భార‌త్ త‌రుపున ఆడి ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన ప్రజ్ఞానందకు కూడా కారు బహుమతిగా ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా ఆనంద్‌ మహీంద్రాను చాలా మంది కోరారు. అయితే అందులో ఓ ట్వీట్‌పై స్పందించిన ఆనంద్‌ మహీంద్రా.. చాలా మంది తనకు ఇటువంటి విజ్ఞప్తులే చేస్తున్నారని.. అయితే తనకు మరో ఆలోచన ఉందని తెలిపారు.

ప్రజ్ఞానందకు బదులుగా.. తమ కుమారుడి ఆసక్తిని గమనించి, ఇంతటి వాడిని చేసిన అతని తల్లిదండ్రులకు కారు బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. కుమారుడు ఆసక్తిని గమనించి, ప్రోత్సహించిన ప్రజ్ఞానంద తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేష్‌బాబుకు కృతజ్ఞతలు చెప్పారు. వారికి మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్‌ కారును బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఆన్‌లైన్ గేమ్‌లతో ప్రపంచాన్ని మరిచిపోతున్న పిల్లలున్న పరిస్థితుల్లో.. ప్రజ్ఞానంద ఆటకు మద్దతు ఇవ్వడమే కాకుండా, విలువలను కూడా పెంచారని ప్రశంసలు కురిపించారు. ఇదో మంచి పరిణామమని ఆనంద్‌ మహీంద్రా చెప్పారు. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. వేలాది మంది కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement