Friday, May 10, 2024

అక్ష‌ర్ ప‌టేల్ క‌ళ్ల‌ద్దాలు పెట్టుకున్న ఆనంద్ మహీంద్రా..

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి ట్వీట్ తో ఆకట్టుకున్నాడు. ఎప్పుడు ఏదో ట్వీట్ చేసి నెటిజన్ లను ఆకట్టుకునే ఆనంద్ మహీంద్రా ఈసారి టీమిండియా ఆటగాడు అక్షర పటేల్ ను గురించి ట్వీట్ చేశాడు. భారత్ ఇంగ్లాండు టెస్ట్ సిరీస్ సంధర్భంగా అక్షర్ ధరించిన ఆ అద్దాలు తనకు కావాలని అవి ఎక్కడ దొరుకుతాయని నెటిజన్లను అడిగాడు. అన్నట్లు గానే అక్షర్ ధరించిన మోడల్ బ్రాండ్ అద్దాలు వెతికిమరి కొనుకున్నాడు.. అయితే, వాటిని ఇప్ప‌ట్లో పెట్టుకోన‌ని టీ20 సిరీస్ ను భార‌త్ గెలిస్తే తప్పకుండా పెట్టుకుంటానని ట్వీట్ చేశాడు ఆనంద్ మహీంద్ర. తాజాగా టీమిండియా టీట్వంటీ సిరీస్ గెలవడంతో ఆ క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని ఫొటోను ట్వీట్ చేస్తూ.. తాను ఇప్పుడు త‌న మాట‌ను‌ నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ‘అక్షర్‌ షేడ్స్‌’తో సెల్ఫీ తీసుకొని షేర్ చేస్తున్నాన‌ని పేర్కొన్నారు. కాగా, టీవీలో  కోహ్లీ విజ‌యానందంతో పొంగిపోతోన్న దృశ్యం ముందు నిల‌బ‌డి ఆనంద్ మ‌హీంద్ర‌ విక్టరీ సింబల్‌ చూపిస్తూ ఈ ఫొటో తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement