Thursday, May 16, 2024

Escape in heart – కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి తప్పిన పెనుప్రమాదం

రాజస్థాన్ – కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి పెనుప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లోని నాగౌర్‌‌లో రోడ్ షో నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ వైర్లు ఆయన ప్రచార వాహనాన్ని తాకాయి. దీంతో కరెంటు తీగ తెగి కింద పడింది. గమనించిన బీజేపీ నేతలు వెంటనే అప్రమత్తమయ్యారు. అమిత్‌ షా వాహనం వెనుకాల ఉన్న అన్ని వాహనాలను అప్రమత్తం చేశారు. వాహనాలను నిలిపివేసి కరెంటు సరఫరాను నిలిపేశారు. దీంతో ప్రమాదం తప్పింది. హోమంత్రి అమిత్ షా సహా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఎన్నికల సభలో పాల్గొనేందుకు బిడియాద్ గ్రామం నుంచి పర్బత్‌సర్ దిశగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement