Wednesday, May 1, 2024

అమిత్ షా స‌భ‌లో విషాదం – 11కి చేరిన వ‌డ‌దెబ్బ మృతుల సంఖ్య‌

ముంబై: మహారాష్ట్ర భూషణ్ అవార్డును అందజేయడానికి ప్రభుతం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై వ‌డ దెబ్బ బారిన‌ప‌డిన వారిలో మ‌రోక‌రు నేడు మ‌రణించ‌డంతో మృతుల సంఖ్య 11కి పెరిగింది. కాగా,అదివారం జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజ‌రయయారు.. అలాగే స‌భ‌కు వేలాదిమంది ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చారు.. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పలువురు మంత్రులు ఇందులో పాల్గొన్నారు. అప్పాసాహెబ్ ధర్మాధికారి, మరికొందరికి అమిత్ షా మహారాష్ట్ర భూషణ్ అవార్డులను అందజేశారు. ఆదివారం ఉదయం 11:00 గంటలకు ప్రారంభమైన ఈ అవార్డుల ప్రదానోత్సవం మధ్యాహ్నం వరకూ కొనసాగింది. ఓపెన్ గ్రౌండ్‌లో ఇది ఏర్పాటైంది. ఎలాంటి షెడ్లు గానీ, షామియానా గానీ ఏర్పాటు చేయలేదు మహారాష్ట్ర ప్రభుత్వం. ఫలితంగా ఈ కార్యక్రమానికి వచ్చిన వేలాది మంది ఎర్రటి ఎండలో కొన్ని గంటల పాటు కూర్చోవాల్సి వచ్చింది. ఈ సభకు ఆతిథ్యాన్ని ఇచ్చిన ఖార్‌ఘర్‌లో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఎలాంటి షెడ్లు గానీ, షామియానా గానీ ఏర్పాటు చేయకపోవడం, కొన్ని గంటల పాటు ఎండలో కూర్చోవడం వల్లే వారు గుండెపోటుకు గురై ఉంటారనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. అవార్డుల ప్రదానోత్సవం ముగిసేసరికి చాలామంది వడదెబ్బకూ గురయ్యారు. వారిని హుటాహుటిన ఎంజీఎం కామోతె ఆసుపత్రికి తరలించారు. హ‌స్ప‌ట‌ల్ లో చికిత్స పొందుతూ ఆదివారం 10 మంది మృతి చెంద‌గా, నేడు మ‌రోక‌రు క‌న్నుమూశారు. మరో 50 మంది చికిత్స పొందుతున్నారు.


ఈ ఘటన పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల పరిహారాన్నిచెల్లిస్తామని ఏక్‌నాథ్ షిండే ప్రకటించారు. ఇది దురదృష్టకర ఘటనగా దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరే, ప్రతిపక్ష నేత అజిత్ పవార్.. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.
ఎండ తీవ్రంగా ఉన్న విషయం తెలిసినప్పటికీ.. ప్రభుత్వం కనీస జాగ్రత్తలను తీసుకోలేకపోయిందని ఉద్ధవ్ థాకరే అన్నారు. కాస్త నీడ కల్పించాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి రాకపోవడం బాధాకరమని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement