Saturday, May 4, 2024

అంబేద్కర్ రాజ్యాంగమే దేశాన్ని నడిపిస్తోంది – పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే దేశాన్ని నడిపిస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం లోని సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయ‌న‌ మాట్లాడుతూ… ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ అని, భారత దేశం గర్వించదగ్గ మేధావిగా నిలిచారన్నారు. తన మేధస్సుతో దేశాన్ని నడిపించే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్‌లాంటి మహనీయుల జీవితాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అంబేద్కర్‌ ఆశయసాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పౌరులంతా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అంబేద్కర్‌ కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement