Thursday, May 2, 2024

అంబేద్కర్‌ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సులు, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమాతోపాటు పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో చేరేందుకు అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ సోమవారం విడుదలైంది. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సు తదితర వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 2022-23 విద్యాసంవత్సరం మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులు రెండో సంవత్సరం ట్యూషన్‌ ఫీజును, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా ఆగస్టు 16వ తేదీలోపు ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్‌ డా.ఎల్వీకే రెడ్డి తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement