Monday, May 20, 2024

రేపే రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల కేటాయింపు.. అలాట్‌మెంట్ అయిన వారికి ఫోన్ మెస్సేజ్‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:రాజీవ్‌ స్వగృహ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్ల కేటాయింపుకు సంబంధించిన లాటరీ ప్రక్రియ బుధవారం జరగనుంది. ఈమేరకు హెచ్‌ ఎండీఏ, హౌసింగ్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫ్లాట్స్‌ అలాట్‌మెంట్‌ అయిన వారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం వెళ్తోందని అధికారులు చెబుతున్నారు.

బండ్లగూడ, పోచారంలో మొత్తం ట్రిపుల్‌బెడ్‌ రూమ్‌ డీలక్స్‌, ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌, డబుల్‌, సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్లకు గత నెల 11న హెచ్‌ఎండీఏ మొదటి దశలో 2971 ఫ్లాట్లకు, గత నెల 25న రెండో దశలో 1187 ఫ్లాట్లకు హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 14న దరఖాస్తు గడువు ముగిసింది. అధికారులు ఊహించని విధంగా రెండు ప్రాంతాల్లోని ఫ్లాట్లకు 39,082 దరఖాస్తులు వచ్చాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement