Tuesday, May 21, 2024

అన్ని విష‌యాలు స‌రైన స‌మ‌యంలో తెలుస్తాయి-విఘ్న‌శ్ శివ‌న్

మ‌హాబ‌లిపురంలో జూన్‌ 9న పెళ్లి బంధంతో ఏకమయ్యారు హీరోయిన్ న‌య‌న‌తార‌..విఘ్న‌శ్ శివ‌న్. కాగా నయనతార-విఘ్నేశ్​ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. తమకు ఇద్దరు మగ పిల్లలు(కవలలు) జన్మించారంటూ ఇటీవలే సోషల్​మీడియా ద్వారా తెలిపారు. అయితే దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే వీరికి పెళ్లై ఇంకా నాలుగు నెలలే అవుతోంది. అందులోనూ వీరు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయ్యారు. దీంతో వారిద్దరిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అలాగే తమకు పిల్లలు ఎలా పుట్టారో వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. తాజాగా విఘ్నేష్ శివన్ తన ఇన్​స్టాలో షేర్ చేసిన పోస్ట్​ ఒకటి వైరల్​ అవుతోంది. ఇందులో ‘అన్ని విషయాలు సరైన సమయంలో మీకు తెలుస్తాయి. అప్పటివరకు ఓపికపట్టండి. ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండండి’ అని అందులో రాశారు. ఇప్పుడీ పోస్ట్​ నెట్టింట వైరలవుతోంది. సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులుగా మారిన నయన్ దంపతులు ఈ విషయం పై నేరుగా స్పందించకుండా ఇలా పరోక్షంగా స్పందించారని నెటిజన్లు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement