Sunday, April 28, 2024

TS : ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి… సీఎం రేవంత్‌రెడ్డి

భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భగవంతుడిని ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యాన్ని దేశమంతటికీ చాటేలా ఘనంగా నవమి వేడుకలను నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -

భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సిఎం రేవంత్ సూచించారు. సిఎంతో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement