Thursday, May 2, 2024

ఆడపిల్లకి జన్మనిచ్చిన ఆలియా.. పండగ చేసుకుంటోన్న రాఖీ సావంత్

తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటుంది బాలీవుడ్ నటి రాఖీ సావంత్..ఈమెకి సంతోషం కలిగినా, బాధ కలిగిన ఆపుకోవడం కష్టమే. తాజాగా రాఖీ సావంత్ తన ప్రియుడితో కలిసి సంబరాల్లో మునిగిపోయింది. అందుకు కారణం ఉంది. నేడు బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ తల్లిదండ్రులు అయ్యారు. అలియా భట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీనితో కపూర్ ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో అభిమానులు, సెలెబ్రిటీలు అలియా, రణబీర్ లకు వెల్లువలా శుభాకాంక్షలు చెబుతున్నారు.

రాఖీ సావంత్ ఏం చేసినా వెరైటీ కాబట్టి అలియా, రణబీర్ లకు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది. దోసె పెనంతో సౌండ్ చేస్తూ తన బాయ్ ఫ్రెండ్ తో కలసి రచ్చ చేసింది. ‘మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అంటూ పాట పాడుతూ తన సంతోషాన్ని తెలియజేసింది. అలియా భట్ ఇదిగో స్వీట్ తీసుకో.. దేశ ప్రజలందరి నుంచి శుభాకాంక్షలు అందుకో.. ఇది ప్రౌడ్ మూమెంట్. తల్లిదండ్రులు అయినందుకు అలియా, రణబీర్ ఇద్దరికీ శుభాకాంక్షలు. నీతూజీకి , కపూర్ ఫ్యామిలీ అందరికి నా బెస్ట్ విషెస్ అంటూ రాఖి సావంత్ తన ప్రియుడుతో కలసి విషెస్ తెలిపింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement