Thursday, May 2, 2024

మ‌రాఠీ చిత్రంలో అక్ష‌య్ కుమార్.. ఛ‌త్ర‌ప‌తి శివాజీగా అల‌రించ‌నున్న హీరో

మొద‌టిసారిగా మ‌రాఠీ చిత్రంలో న‌టిస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్. ఈ చిత్రాన్ని మ‌మేశ్ మంజ్రేక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీకి వేదాత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్ టైటిల్ ను కూడా ఖరారు చేశారు.ఈ చిత్రంలో జయ్ దుధానే, ఉత్కర్ష షిండే, విశాల్ నికమ్, విరాట్ మడ్కే, హార్దిక్ జోషి, సత్య, అక్షయ్, నవాబ్ ఖాన్, ప్రవీణ్ టార్డే నటిస్తున్నారు. ఖురేషి ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మరాఠీ, హిందీ, తమిళం .. తెలుగు భాషలలో 2023 దీపావళికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ను ముంబైలో ప్రారంభించారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘ఈ రోజు నేను మరాఠీ చిత్రం ‘వేదాత్ మరాఠే వీర్ దౌడలే సత్’ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాను. ఇందులో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీ పాత్రను పోషించడం నా అదృష్టం. ఆయన జీవితం, తల్లి జిజావు ఆశీర్వాదంతో ప్రేరణ పొందాను. నా వంతు కృషి చేస్తాను! మీ ఆశీర్వాదం కూడా మాపై ఉండాలి’ అని కోరారు. వేదాత్ మరాఠే వీర్ దౌడలే సాత్’ ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా మరాఠీ భాషాలో తెరకెక్కుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement