Thursday, May 2, 2024

అక్టోబర్ 15న వస్తున్న ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’

అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ చిత్రం విడుదల తేదీ మారింది. తొలుత ఈ మూవీ అక్టోబర్ 8న విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించగా.. తాజాగా దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు తెలిపింది. అల్లు అరవింద్ సమర్ఫణలో వస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు.

జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని క్రేజీ ప్రొడ్యూస‌ర్ బన్నీ వాసు, మరో ప్రొడ్యూస‌ర్‌ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మోస్ట్ క్రేజీ కాంబీనేష‌న్‌తో వ‌స్తున్న‌ ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అక్కినేని యంగ్ హీరో అఖిల్‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కాలంగా అఖిల్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement