Thursday, May 2, 2024

శ్రీలంక ఆరోపణల దృష్టి మరల్చడానికేనా ‘అగ్నిపథ్‌’ : కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్‌ స్కీమ్‌పై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. శ్రీలంక పవన విద్యుత్‌ కాంట్రాక్టుల్లో మోడీ-అదానీ అవినీతి బంధంపై దేవం దృష్టిని మరల్చడానికే అగ్నిపథ్‌ స్కీమ్‌ను ప్రకటించారా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇక అగ్నిపథ్‌ స్కీమ్‌ను సమర్ధిస్తున్న కేంద్ర మంత్రులపై కూడా కేటీఆర్‌ మండిపడ్డారు.

అగ్నిపథ్‌ పథకం యువతకు డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, బార్బర్‌లు, వాషర్‌మెన్‌గా ఉపాధి కల్పించడంలో సహాయపడుతుందని చెప్పడాన్ని కేటీఆర్‌ తప్పుబట్టారు. అగ్నివీరులను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తామని మరో కేంద్ర మంత్రి చెప్పడాన్ని కూడా కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదేనా మోడీని అర్ధం చేసుకోలేదని మీరు యువతను నిందిస్తున్నారా అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement