Sunday, May 19, 2024

అఫ్ఘాన్ లో మొదలైన తాలిబాన్ల పాలన..కాబూల్ లో కర్ఫ్యూ

ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబాన్లు చేజిక్కించుకున్న తర్వాత అక్కడ తొలి సారి కర్ఫ్యూ విధించారు. ప్రజలందరూ అయోమమ పరిస్థితుల నడుమ దేశం దాటి వెళ్లేందుకు తాలిబన్లు చర్యలు చేపట్టారు. దీంతో ప్రజలను కట్టడి చేసేందుకు కాబుల్ లో కర్ఫ్యూ విధించారు. కాబూల్ లో అధికారికంగా కర్ఫ్యూ విధించింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ నిర్మనుష్యంగా మారిపోయాయి.

తాలిబన్లు ఆఫ్ఘన్ ని ఆక్రమించిన తర్వాత అక్కడి పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే తాలిబాన్లు అత్యంత కఠినమైన షరియా చట్టాలను అమల్లోకి తీసుకొచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాలిబాన్ల పాలనలో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే  భయంతో దేశాన్ని వదిలి వెళ్లేందు అక్కడి ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కాబూల్ లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. వీలైనంత త్వరగా దేశాన్ని వీడిపోవాలనే ఆతృత కాబూల్ ప్రజల్లో ఉంది. ఈ క్రమంలోనే కాబూల్ ఎయిర్ పోర్ట్ నిన్న ప్రజలతో కిక్కిరిసి పోయింది. ఈ నేపథ్యంలో కాబూల్ లో గందరగోళ పరిస్థితులను నియంత్రించేందుకు ఆఫ్ఘాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు శుభవార్త

Advertisement

తాజా వార్తలు

Advertisement