Friday, May 3, 2024

టీచర్ల బదిలీల కేసు 27కు వాయిదా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కేసు ఈనెల 27కు వాయిదా పడింది. గురువారం హైకోర్టులో బదిలీలు, ప్రమోషన్లపైన విచారణ జరిగింది. ఇరువర్గాల మధ్య వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ఇప్పటికే ఈనెల 18, 19, 20వ తేదీన వాయిదా పడిన కేసు..మళ్లిd 27కు వాయిదా పడడంతో ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసు కొలిక్కి వచ్చి తమకు ఎప్పుడు ప్రమోషన్లు వస్తాయని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement