Monday, April 29, 2024

ఆదివాసీల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి : నారా లోకేష్‌

ఆదివాసీలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అడవి తల్లిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పోలవరం ప్యాకేజి దగ్గర నుండి ఎన్నో ఏళ్లుగా గిరిజనానికి హక్కుగా వస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేయడం వరకూ జగన్ రెడ్డి వారిని నమ్మించి వంచించారని మండిపడ్డారు. మాటలతో కోటలు కట్టడం మాని వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని లోకేష్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement