Friday, May 3, 2024

టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు రాజబాబు(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా నరసాపురపేటలో జన్మించిన రాజబాబుకు బాల్యం నుంచే రంగస్థలం మీద నటించడం అంటే ఎంతో ఇష్టం. 1995లో వచ్చిన ‘ఊరికి మొనగాడు’ చిత్రంతో సినిమా రంగానికి పరిచయమయ్యారు. సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారీ, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో నటించారు. పలు సీరియల్స్ లోనూ నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజబాబు మృతిపై పలవురు సినీ నటులు సంతాపం తలిపారు.

ఇది కూడా చదవండి: గులాబీ వేడుక.. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్!

Advertisement

తాజా వార్తలు

Advertisement