Wednesday, May 1, 2024

జాన్వీ క‌పూర్ అపార్ట్ మెంట్ ని – రూ.44కోట్ల‌కి కొనుగోలు చేసిన న‌టుడు

సినీ సెల‌బ్రిటీలు అంద‌రూ నివాసం ఉండే ముంబ‌యి పోష్ ఏరియా జుహూ అని అంద‌రికీ తెలిసిందే. ఈ పోష్ ఏరియా జుహులో ట్రిపుల్స్ అపార్ట్ మెంట్ కొనుగోలు కోసం రూ. రూ. 44 కోట్లు చెల్లించడమే గాక.. రిజిస్ట్రేషన్ కి 2.19 కోట్లు చెల్లించాడ బాలీవుడ్ న‌టుడు రాజ్ కుమార్ రావు. 6 ప్రత్యేకమైన పార్కింగ్ స్లాట్ లతో కూడిన ట్రిప్లెక్స్ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసేందుకు రాజ్ కుమార్ రావు రూ.46 కోట్ల వరకూ వెచ్చించడం హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కుమార్ రావు..పత్రలేఖ జంట జుహూలో కొత్త ఆస్తిని సంపాదించడానికి రూ.44 కోట్లు వెచ్చించడం విశేషం.

తాజా కథనాల ప్రకారం.. రావు – పత్రలేఖ జంట జుహూలో ఒక ట్రిప్లెక్స్ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసారు. అది నిర్మాత బోనీ కపూర్ కుమార్తె జాన్వీ కపూర్ కి చెందిన అపార్ట్ మెంట్ అని తెలిసింది. 3456 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తిని 2020 డిసెంబర్ లో జాన్వీ కపూర్ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ ఆస్తిని రాజ్ కుమార్ రావుకు విక్రయించినట్లు తెలుస్తోంది. దీని ధరను చ.అ.కు దాదాపు రూ.1.27 లక్షలుగా నిర్ణయించారు. ఈ అపార్ట్ మెంట్ 14వ, 15వ, 16వ అంతస్తులలో అటాచ్డ్ గా ఉంటుంది. దాంతో పాటు ఆరు పార్కింగ్ స్లాట్ లకు ప్రత్యేకమైన యాక్సెస్ కోసం రూ.2.19 కోట్లను రిజిస్ట్రేషన్ గా వెచ్చించారని కూడా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement