Friday, April 26, 2024

బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డిపై హీరో సిద్ధార్థ్ ఆగ్రహం

తన కుటుంబ సభ్యులను చంపేస్తామని, అత్యాచారం చేస్తామంటూ బీజేపీ నేతల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని హీరో సిద్ధార్థ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో తమిళనాడు బీజేపీ నేతలతో పాటు కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్యను కూడా హీరో సిద్ధార్థ్ టార్గెట్ చేశాడు. తేజస్విని సిద్ధార్థ్ టెర్రరిస్టుతో పోల్చాడు. దీంతో సిద్ధార్థ్‌పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

సిద్ధార్థ్ సినిమాలకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడని విష్ణు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా సిద్ధార్థ్ స్పందించాడు. తాను అసలైన భారతీయుడినని, సక్రమంగా పన్నులు కడుతున్నానని చెప్పాడు. ‘లేదురా. నా టీడీఎస్ చెల్లించడానికి ఆయన రెడీగా లేడు. నేను అసలైన భారతీయుడిని, ట్యాక్స్ పేయర్ కదరా విష్ణు. వెళ్లి పడుకో. బీజేపీ స్టేట్ సెక్రటరీ అంట. సిగ్గుండాలి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

https://twitter.com/Actor_Siddharth/status/1390401205860401156
Advertisement

తాజా వార్తలు

Advertisement