Friday, May 3, 2024

Accident – బ్రేక్ ఫెయిల్ తో అదుపుత‌ప్పిన ట్ర‌క్కు … ముగ్గురు మృతి..

పూణె …మహారాష్ట్రలోని పూణే లో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. పూణెలో సోమవారం రాత్రి ట్రక్కు ఢీకొనడంతో మంటలు చెలరేగడంతో ఇద్దరు మైనర్‌లతో సహా నలుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.. ఈ ప్రమాదం గురించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.. వారు అక్కడకి చేరుకొని దాదాపు గంట శ్రమించి మంటలను అదుపు చేశారు..
వివరాల్లోకి వెళితే..పూణె-బెంగళూరు హైవేపై స్వామినారాయణ దేవాలయం, నవ్లే వంతెన సమీపంలో రాత్రి 9.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు .బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ట్రక్కు కంటైనర్‌ను ఢీకొట్టిందని, ఆపై మరో ట్రక్కును ఢీకొట్టిందని, ఆ తర్వాత ట్రక్కును ఢీ కొట్టింది.. ఈ ప్రమాదంలో ట్రక్కు లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాద ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పూణె మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాలిపోతున్న ట్రక్కులో నుంచి బాధితుల మృతదేహాలను తొలగించి ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగినప్పుడు ట్రక్కులో ఆరుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు.

ట్రక్కులో ప్రమాద సమయంలో ఉన్న వారిలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు ట్రక్కు నుంచి దూకి తప్పించుకోగలిగారు. వారు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారని పోలీసులు చెప్పారు. అయితే మృతులను ఇంకా గుర్తించలేదని వారు తెలిపారు. పోస్ట్ మార్టం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.. అంతేకాదు ఈ ప్రమాదంలో మరో ఇద్దరికీ గాయాలు అయ్యాయి.. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement