Friday, April 26, 2024

ప్రముఖ జర్నలిస్ట్ వెంకటకృష్ణపై విషప్రచారం

ప్రముఖ జర్నలిస్ట్ వెంకటకృష్ణ ప్రస్తుతం ఒక ప్రముఖ తెలుగు ఛానల్‌లో పని చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సాయంత్రం ఆయన చేసే డిబేట్లు ప్రజలను ఎంతగానే ఆకర్షిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏపీలోని సమస్యలపై ఆయన చేసే చర్చలు అర్ధవంతంగా ఉంటాయి. ఎక్కడా అరుపులు, కేకలు లేకుండా అర్ధవంతంగా చర్చలు జరుగుతూ ఉంటాయి. అయితే నిన్నటి నుంచి వెంకటకృష్ణపై విష ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీకి సంబందించిన కార్యకర్తలు ఈ ప్రచారం మొదలు పెట్టారు. ఆయనను ప్రస్తుతం పని చేస్తున్న ఛానల్ తప్పించిందని, వెంకటకృష్ణ బ్లాక్ మెయిల్ చేశారని, డబ్బులు తీసుకున్నారని విష ప్రచారం మొదలు పెట్టారు. బుధవారం వెంకటకృష్ణ కూడా డిబేట్‌కు రాకపోవటంతో ఈ ప్రచారానికి ఊతమిచ్చినట్టు అయ్యింది.

అయితే దీనిపై వెంటనే వెంకటకృష్ణ తన ట్విట్టర్‌లో స్పందించారు. తన ప్రయాణంలో ఎన్నో మజిలీలు, సవాళ్లు ఉంటాయని, ఇప్పటికి అయితే కేవలం సెలవు మాత్రమే తీసుకున్నానని, ఏమైనా ఉంటే త్వరలో చెప్తానని, తనపై కొంత మంది సునకానందం గాళ్ళు ట్రోల్ చేస్తున్నారని.. అవి పట్టించుకోకండి అని ట్వీట్ చేశారు. అయితే గురువారం ఉదయానికి ఈ ప్రచారం తారా స్థాయికి చేరింది. వెంకటకృష్ణకు, ఆ టీవీ యాజమానికి గొడవ అయినట్టు ప్రచారం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement