Sunday, April 28, 2024

Delhi: ఆధార్ ఉచిత అప్ డేట్ గ‌డువు మ‌రో మూడు నెల‌లు పొడిగింపు..

న్యూ ఢిల్లీ – ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ఈనెల‌ 14తో ముగియనుంది.. దీంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థస‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు పొడిగిస్తున్నట్లు వెల్ల‌డించింది. ఈ మేరకు ఉడాయ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో జూన్‌ 14 వరకు ఉచితంగా ఆధార్‌లో మార్పులు చేసుకోవచ్చు.

తొలుత 2023 మార్చి15 వరకు ఉన్న గడువును డిసెంబరు 14 వరకు పొడిగించింది. తర్వాత 2024 మార్చి 14 వరకు అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా మరోసారి గడువు తేదీని పొడిగించింది. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉడాయ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement