Thursday, May 2, 2024

బిర్యానీలో లెగ్ పీస్ రాలేదని కేటీఆర్ కు ట్విటర్ లో ఫిర్యాదు చేసిన నెటిజన్

ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయమైనా సరే ఇట్టే వైరల్ అవుతోంది. అది సెలబ్రిటీలు రాజకీయ నాయకుల విషయంలో అయితే మరికాస్త ఎక్కువగా ఉంటుంది. కాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఎవరైనా ట్విట్టర్ లో కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ వారి సమస్యలను చెప్పుకుంటే అప్పుడప్పుడు కేసీఆర్ ఆ సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాకుండా అందరికీ కేటీఆర్ రెస్పాండ్ అవుతూ ఉంటారు. అయితే ఓ నెటిజన్ ఇప్పుడు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది . తోటకూర రఘుపతి అనే వ్యక్తి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ… కేటీఆర్ సార్ నేను ఆన్లైన్ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. అయితే ఆ బిరియాని లో అదనపు మసాలాతో పాటు లెగ్ పీస్ రాలేదు. కావాలంటే ఈ ఫోటో చూడండి. ప్రజలకు ఇలాగేనా సేవలు అందించడం అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అయితే దీనిపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఈ బిర్యానీ విషయంలో నేనేం చేయగలను బ్రదర్.. నా నుంచి నువ్వేం ఆశిస్తున్నావ్ అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement