Sunday, April 28, 2024

Breaking | లారీ ఢీకొని స్పాట్​లోనే వ్యక్తి మృతి.. గుంటూరులో ఘటన

గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ దగ్గరలో అతివేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని లారీని పోలీస్ స్టేషన్ కి తరలించారు. మృతుడి వివరాలు సేకరిస్తున్నారు.

కొన్ని రోజులుగా మిర్చి యార్డు వద్ద భారీగా మిర్చి లోడుతో ఉన్న వెహికల్స్ రోడ్డుకు విలువైపులా ఉండటం వల్లే యాక్సిడెంట్ జరుగుతున్నాయని, అక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా రోడ్డుమీద మిర్చి లోడ్ తో వచ్చే వాహనాలు ఉండకుండా ట్రాఫిక్ పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement