Monday, April 29, 2024

పంజాబీ సింగర్‌ సిద్ధూ హత్య కేసులో కీలక పరిణామం

పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నేరం తన ముఠా పనే అని అంగీకరించినట్లు తెలుస్తోంది. పంజాబీ సింగర్‌సిద్ధూ మూసే వాలా హత్యను తన ముఠా సభ్యులే చేశారని విచారణలో బిష్ణోయ్‌, పంజాబ్‌ పోలీసుల వద్ద చెప్పినట్లు సమాచారం. నిన్నటి దాకా(గురవారం) అసలు తనకు హత్యతో సంబంధం లేదని వాదిస్తూ వచ్చాడు బిష్ణోయ్‌. ఈ క్రమంలో తాజాగా.. విక్కీ మిద్దుఖేరా తన అన్న అని, అతని హత్యకు ప్రతీకారంగానే ఇప్పుడు సిద్ధూని తన ముఠా మట్టుబెట్టిందని బిష్ణోయ్‌ పోలీసులతో వెల్లడించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement