Thursday, May 2, 2024

ఇండియాలో కరోనా దెబ్బకు 24 గంటల్లో 2330 మంది మృతి

ఇండియా లో కరోనా వ్యాప్తి తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో కొత్తగా 67,208 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మ‌రో వైపు 1,03,570మంది కరోనా నుంచి కొలుకున్నారు. అలాగే చికిత్స పొందుతూ మ‌రో 2,330మంది గడిచిన 24 గంటల్లో మృతి చెందారు.

తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,97,00,313కి చేరింది. అలాగే రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 2,84,91,670కి చేరింది. మరోవైపు మ‌ర‌ణాల సంఖ్య 3,81,903కి చేరింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 8,26,740కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement