Wednesday, May 1, 2024

నా భర్త నాకు కావాలి… ఓ కానిస్టేబుల్ భార్య కథ

గత 15 రోజుల నుండి భర్త ఇంటి ముందు న్యాయ పోరాటం చేస్తుంది ఓ వివాహిత. తిండితిప్పలు కుడా ఇంటి ముందే చేస్తున్నా పట్టించుకోనే నాథుడే లేడు. న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చుంది ఆ మహిళ. వివరాల్లోకి వెళ్తే రాజ్ కిరణ్ ఉజ్వల 2016 పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని అత్తగారింట్లో అడుగు పెట్టినప్పటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఒక వైపు భర్త, మరో వైపు అత్తమామలు ఇద్దరూ కూడా వేదించసాగారు. రాజ్ కిరణ్ వృత్తి రీత్యా గౌలిగుడ ఫైర్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఓ రోజు రాజ్ కిరణ్ ఇంట్లో నుండి గెంటేసి ఇంటికి తాళంవేసి పారిపోయారని ఉజ్వల ఆరోపిస్తుంది.

దీనితో రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి తుర్క యాంజల్ కమ్మగూడలో న్యాయం కావాలంటూ ఇంటి ముందు పోరాటానికి దిగింది. నాకు న్యాయం చెయాలని… నా భార్త నాకు కావలని ఇంటి ముందు కూర్చుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement