Thursday, May 16, 2024

TS | తెలంగాణలో 95 మంది డీఎస్పీలు బదిలీ..

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్‌ శాఖలో పెద్ద ఎత్తున అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా పోలీసుశాఖలో భారీగా బదిలీలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 95 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను, ఏసీపీలను బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులను బదిలీ చేసినట్లు తెలుస్తున్నది. గతమూడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న, సొంత జిల్లాల్లో పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ డిసెంబర్‌లో ఆదేశించిన విషయం తెలిసిందే. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారులకు స్థాన చలనం కల్పిస్తున్నది

Advertisement

తాజా వార్తలు

Advertisement