Monday, April 29, 2024

24 గంటల్లో 7వేల కేసులు.. 343 మంది మృతి

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా రెండో రోజు 8వేలకు దిగువకు కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,447 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా బాధితుల సంఖ్య 3,47,26,049లకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 343 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 4,76,869 మంది మరణించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

24 గంటల్లో 12,16,011 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్టు తెలిపింది. కరోనా కారణంగా 7,948 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం 3,41,54,879 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 86,415 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 1,35,99,96,267 కరోనా డోసులను పంపిణీ చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement