Tuesday, May 21, 2024

దేశంలో కొత్తగా 62480 కరోనా కేసులు…మరణాలు ఎన్నో తెలుసా ?

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అదే స్థాయిలో నమోదు అవుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో
కొత్త‌గా 62,480 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీనితో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,97,62,793 కి చేరింది. అలాగే 2,85,80,647 మంది ఇందులో డిశ్చార్జ్ కాగా, 7,98,656 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.

మారోవైపు గ‌డిచిన 24 గంట‌ల్లో మహమ్మారి కారణంగా 1,587 మృతిచెందారు. తాజా మృతి చెందినవారితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 3,83,490 కి చేరింది. అలాగే 24 గంటల్లో క‌రోనా నుంచి 88,977 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement