Tuesday, April 30, 2024

పునీత్ రాజ్ కుమార్ కుమారై కోసం..అంత్య‌క్రియ‌లు వాయిదా..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో యావత్ భారత చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో యాక్టీవ్ గా ఉండే పునీత్ మర‌ణాన్ని జీర్ణించుకోలేక‌పోతోంది సినీ ప‌రిశ్ర‌మ‌..ఆయ‌న అభిమానులు. శుక్రవారం జిమ్ లో కసరత్తులు చేస్తుండగా పునీత్ గుండెపోటుకు గురై ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. కాగా ఆయన అంత్యక్రియలకు కర్ణాటక ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తన తండ్రి రాజ్ కుమార్ సమాధి పక్కనే పునీత్ కు కూడా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దాదాపు 6 వేలమంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ప్రస్తుతం పునీత్ పార్థివ దేహాన్ని కంఠీరవ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అన్ని చిత్రాల పరిశ్రమల నుంచి స్టార్ నటీనటులు.. రాజకీయ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు పునీత్ కడసారి చూపు కోసం బెంగళూరు పయనం అవుతున్నారు. ఇక తెలుగుతో పునీత్ రాజ్ కుమార్ కి విడదీయరాని అనుబంధం ఉంది. టాలీవుడ్ లో చాలామంది సినీ ప్రముఖులు పునీత్ కు స్నేహితులే. దశాబ్దాల కాలంగా పునీత్ ఫ్యామిలీతో మెగా, నందమూరి కుటుంబాలకు మంచి రిలేషన్ ఉంది.

కాగా తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఇళయదళపతి విజయ్ కూడా పునీత్ అంత్యక్రియలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా పడ్డాయి. కుటుంబసభ్యుల రాక ఆలస్యం అవుతుండ‌టంతో అంత్యక్రియలను వాయిదా వేసినట్లుగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అధికారికంగా ప్రకటించారు. పునీత్ కుమార్తె ధృతీ అమెరికా నుంచి రాకపోవడంతో అంత్యక్రియలు రేపటికి వాయిదా పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement