Wednesday, May 1, 2024

Accident | బైక్‌ని తప్పించబోయి బావిలో పడ్డ కారు.. స్పాట్‌లోనే ఆరుగురు మృతి

కారును త‌ప్పించబోయిన ఓ కారు బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న జార్ఖండ్‌ హజారీబాగ్‌ జిల్లాలో ఇవ్వాల సాయంత్రం జ‌రిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హజారీబాగ్ జిల్లాలోని పద్మ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోమి సమీపంలో ఈ ఘటన జరిగిందని ఎస్పీ మనోజ్ రతన్ పేర్కొన్నారు.

ఎదురుగా వస్తున్న బైక్‌ని తప్పించబోయే క్ర‌మంలో ఈ ఎస్‌యూవీ అదుపు తప్పి బావిలో పడిపోయినట్లు ఎస్పీ మ‌నోజ్‌ తెలిపారు. ప్రమాదంలో ఆరుగురు చ‌నిపోయార‌ని, మృతుల్లో ఒక చిన్నారి, మహిళ కూడా ఉన్నారని చెప్పారు. మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశామ‌ని, మరో ముగ్గురు మహిళలు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement