Wednesday, May 15, 2024

ఇండియాలో కొత్తగా 45,951 కరోనా కేసులు

ఇండియాలో కరోనా తీవ్రత మరింత తగ్గుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా దేశ‌వ్యాప్తంగా 45,951కేసులు రాగా… మ‌రో 60,729 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు కొత్తగా 817మంది కరోనా తో మృతి చెందారు.

తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,03,62,848కు చేర‌గా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,94,27,330కి చేరుకుంది. ఇక అలాగే దేశంలో 5,37,064 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే మ‌ర‌ణాల సంఖ్య 3,98,454కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement