Sunday, April 28, 2024

దేశంలో కొత్తగా కరోనాతో 4329 మంది మృతి….తగ్గేదేలే

భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో మొత్తం 2,63,533కేసులు న‌మోద‌య్యాయి. మరోవైపు 4,22,436మంది క‌రోనాను నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే గడిచిన 24 గంటల్లో 4,329 మంది కరోనా తో మృతి చెందారు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 2,52,28,996 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

అలాగే 2,15,96,512 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక 2,78,719 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 33,53,765 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదు అయిన కేసుల్లో అత్య‌ధికంగా క‌ర్ణాట‌క‌లో 38,603, త‌మిళ‌నాడులో 33,075, మ‌హారాష్ట్రలో 26,616 కేసులొచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement