Sunday, April 28, 2024

TS | 40 మంది జీహెచ్‌ఎంసీ ఉద్యోగులపై ఎన్నకల సంగం కొరడా

హెదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎన్నికల విధులకు హాజరుకాకండా నిర్లక్ష్యం వహిస్తున్న జీహెచ్‌ఎంసీ ఉద్యోగులపై ఎన్నికల కమిషన్‌ కొరడా ఝలిపించింది.ఎన్నికల విధులకు హాజరు కావాలని పలుమార్లు అదేశించినప్పటికి జీహెచ్‌ఎంసీ పరిధిలో వివిధ శాఖలలో పని చేస్తున్న ఉద్యోగులు గైర్హాజరయ్యారు.ఈ క్రమంలో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. 40 మంది ఉద్యోగులపై సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ లో జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ మంగతాయారు ఫిర్యాదు చేశారు.

ఆమె ఫిర్యాదు మేరకు 40 మంది ఉద్యోగుల పై సెక్షన్‌ 134 కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభతో పాటు- కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు- చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టితో కలిసి ఎన్నికల ఏర్పాట్లపై చర్చించామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement