Monday, April 29, 2024

దేశంలో కరోనా మరణాలు అసలు తగ్గట్లేదు…కొత్తగా 3874 మంది మృతి

దేశంలో గత మూడు రోజులుగా అదే స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కానీ మరణాలు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో మొత్తం 3874మ‌ర‌ణాలు నమోదు అయ్యాయి. అలాగే దేశంలో కొత్త‌గా 2,76,070 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 3,69,077మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 2,57,72,400 కి చేరింది. అలాగే 2,23,55,440 మంది కరోనా నుంచి కొలుకున్నారు.అలాగే దేశ వ్యాప్తంగా 2,87,122 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 31,29,878 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement